రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై అమెరికా విధించిన భారీ టారిఫ్లను వ్యతిరేకిస్తూ రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాల వంటి పురాతన నాగరికతలు కలిగిన దేశాలు బెదిరింపులకు లొంగవని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో రష్యా-అమెరికాల మధ్య నెలకొన్ని ఉద్రిక్తతలు, రష్యా-భారత్ మధ్య మరింత బలపడ్డ స్నేహం నేపథ్యంలో లావ్రోవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రష్యాకు చెందిన ప్రధాన టీవీ ఛానెల్ ది గ్రేట్ గేమ్ కార్యక్రమంలో మాట్లాడుతూ లావ్రోవ్.. అమెరికా విధించిన టారిఫ్లపై ఘాటుగా స్పందించారు. 'చైనా, భారత్ రెండూ పురాతన నాగరికత కలిగిన దేశాలు. నాకు నచ్చనిది చేయకండి లేకపోతే.. టారిఫ్లు విధిస్తామని చెప్పి బెదిరించడం ఆ దేశాల విషయంలో పనిచేయదు.' అని ఆయన అన్నారు. అమెరికా తన విధానాల వల్ల ఈ రెండు దేశాలకు ఆర్థికంగా నష్టం కలిగించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని అన్నారు. అయితే టారిఫ్ల వంటి చర్యలు ఆ దేశాలను మార్కెట్, ఇంధనం వంటి రంగాల్లో ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తాయని ఆ ఇంటర్వ్యూలో లావ్రోవ్ పేర్కొన్నారు.
స్నానం చేసే నీటిలో ఒక్క పదార్థం కలిపితే చాలు, ఎలాంటి నొప్పులైనా తగ్గాల్సిందే, పైగా స్కిన్ టైట్గా మారి మెరుస్తుంది
రష్యాపై కొత్త ఆంక్షల విషయంలో ఎటువంటి సమస్య కనిపించడం లేదని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి హయాంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించినట్లు గుర్తు చేశారు. బైడెన్ పదవీ కాలంలో.. ఆయా వ్యవహారాల్లో దౌత్య ప్రయత్నాలకు బదులుగా ఆంక్షలు ప్రయోగించారని, రాజీ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని లావ్రోవ్ పేర్కొన్నారు.
అయితే.. అమెరికా ఇటీవల భారత్పై 50 శాతం టారిఫ్లను విధించిన సంగతి తెలిసిందే. ఈ టారిఫ్ల ప్రభావం రొయ్యలు, వస్త్రాలు, తోలు, పాదరక్షల వంటి రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏకపక్ష టారిఫ్ల వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, అమెరికా వాణిజ్య ప్రతినిధులు ఇటీవలే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభించారు. అంతకు ముందు అంటే ఆగస్టు 25న జరగాల్సిన ఆరో రౌండ్ చర్చలు.. టారిఫ్ల కారణంగా రద్దు అయ్యాయి.
మరోవైపు నవంబర్ 30 తర్వాత డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం 50 శాతం టారిఫ్లపై కోత పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా నిర్ణయం ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన ఆర్థిక సలహాదారు వెంకట్రామన్ అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాతో వాణిజ్య చర్చలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa