ఏపీలోని విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలను తట్టుకోలేక ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కన్నీరు పెట్టిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన జిల్లాలోని వి.టి. అగ్రహారంలో జరిగింది.వివరాల్లోకి వెళితే.. వి.టి. అగ్రహారానికి చెందిన సత్యనారాయణ (60), ఆయన భార్య పార్వతి (55) గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎంత వైద్యం చేయించుకున్నా వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ దంపతులు, ఇక బతకలేమని భావించి కఠిన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శీతలపానీయంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఉదయం ఎంతసేపటికీ తల్లిదండ్రులు గది నుంచి బయటకు రాకపోవడంతో వారి కుమారుడికి అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా, తల్లిదండ్రులు మంచంపై నిర్జీవంగా పడి ఉండటం చూసి షాక్కు గురయ్యాడు. వెంటనే స్థానికుల సహాయంతో కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa