ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీసీఐపై అసలు పెట్టుకున్న ఒమన్ జట్టు

sports |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 05:50 PM

ఆసియా కప్ 2025లో టీమిండియాకు గట్టిపోటీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఒమన్ జట్టు, తమ క్రికెట్ అభివృద్ధి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైపు ఆశగా చూస్తోంది. తమకు భారత్‌లో శిక్షణ అవకాశాలు కల్పించి, అండగా నిలవాలని ఆ జట్టు కెప్టెన్ జతిందర్ సింగ్ బీసీసీఐని అభ్యర్థించాడు.గతరాత్రి అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై కేవలం 21 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, ఒమన్ జట్టు ప్రదర్శించిన పోరాట పటిమపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన భారత సంతతికి చెందిన జతిందర్, తమ యువ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన సలహాలు కూడా తమకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు.తమ ఆటను మరింత మెరుగుపరుచుకోవాలంటే బీసీసీఐ సహకారం ఎంతో అవసరమని జతిందర్ సింగ్ అభిప్రాయపడ్డాడు. "మాకు భారత్‌లో శిక్షణ పొందే అవకాశం కల్పిస్తే ఎంతో మేలు జరుగుతుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో మా ఆటగాళ్ల నైపుణ్యాలకు పదును పెట్టుకోవచ్చు. అలాగే, భారత దేశీయ జట్లతో మ్యాచ్‌లు ఆడే ఏర్పాటు చేస్తే మాకు మరింత అనుభవం వస్తుంది" అని వివరించాడు.అసోసియేట్ దేశం కావడంతో పెద్ద జట్లతో ఆడే అవకాశాలు తమకు చాలా తక్కువగా లభిస్తాయని జతిందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి గొప్ప వేదికలని పేర్కొన్నాడు. బీసీసీఐ తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.గతంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టుకు బీసీసీఐ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టుకు భారత్‌ను హోమ్ గ్రౌండ్‌గా వాడుకునేందుకు అనుమతించడంతో పాటు పలు సౌకర్యాలు కల్పించింది. ఇప్పుడు ఒమన్ కూడా అలాంటి చేయూతనే ఆశిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa