ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీలోకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే?.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 06:51 PM

ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి దారుణమైన ఓటమి ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. అయితే కొన్ని నెలల పాటూ చేరికలు ఆగిపోగా.. తాజాగా మళ్లీ పార్టీల్లో చేరికల సందడి మొదలైంది. వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీ గూటికి చేరారు. ఇటీవల వైఎస్సార్‌‌సీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ మీడియా ఛానల్‌లో వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ మారబోతున్నట్లు కథనాలు వచ్చాయి.. టీడీపీవైపు చూస్తున్నారని ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయన స్పందించారు.. వైఎస్సార్‌సీపీని వీడటంపై క్లారిటీ ఇచ్చారు.


తాను పార్టీమారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు అరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం . రాజకీయాలు వదిలేస్తాను కానీ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.. తాను, రేగం కుటుంబం కట్టె కాలే వరకు జగనన్నతోనే ప్రయాణం కొనసాగుతుందన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ ఓ ఛానల్‌లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమన్నారు. ఇలా తనపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. అరకు నియోజకవర్గ నేతలు,కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది వైఎస్సార్‌సీపీనే అన్నారు.


మీడియాలో వార్తలు రాసేముందు, నిజమని నిర్ధారణ అయ్యాకే ఆ వార్తలను ప్రచుచరించాలన్నారు. అంతేకానీ తప్పుడు కథనాలు సృష్టించడం సరికాదన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో నేతల్లో, కార్యకర్తల్లో ఆ భద్రత భావం కల్పించవద్దని కోరారు. తాను సాధారణ జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిన పార్టీని, జగనన్నను, నియోజకవర్గం ప్రజలను మోసం చేయలేనన్నారు. తన ప్రయాణం జగన్‌తోనే కొనసాగుతందన్నారు. రేగం మత్స్యలింగం గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు.. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్సార్‌సీపీ అరకు టికెట్ ఇవ్వగా.. ఆయన ఘన విజయం సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa