ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ చేతుల మీదుగా.. దేశంలోనే అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్‌ ప్రారంభం

national |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 08:05 PM

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అనగా శనివారం నాడు ఇండియాలోనే అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్‌ను ప్రారంభించబోతున్నారు. రూ.7, 870 కోట్లతో ముంబైలోని ఇందిరా డాక్ దగ్గర ఈ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను నిర్మించారు. ఈ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభం కోసం గుజరాత్ వచ్చిన మోదీ.. అనంతరం భావ్‌నగర్‌లోని జవహర్ మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని దేశ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలానే ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో భాగంగా రూ. 34,200 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు.


అలానే ముంబై, ఇందిరా డాక్ వద్ద నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. అలాగే కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో కొత్త కంటైనర్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక గుజరాత్‌లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం కొన్ని పనులకు శంకుస్థాపన చేశారు.


దీనిలో భాగంగా భావ్‌నగర్‌లోని సర్ టి. జనరల్ హాస్పిటల్, జామ్‌నగర్‌లోని గురు గోవింద్ సింగ్ గవర్నమెంట్ హాస్పిటల్‌ను విస్తరిస్తారు. రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేయడానికి 70 కిలోమీటర్ల జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా మారుస్తారు. దీనివల్ల ప్రయాణం సులువు అవుతుంది, వ్యాపారం కూడా పెరుగుతుంది.


అలానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో రూ. 26,354 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు పునరుత్పాదక ఇంధనం, ఓడరేవు మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఆరోగ్య సంరక్షణ, పట్టణ రవాణా వంటి రంగాలపై దృష్టి పెడతాయి. ఈ ప్రాజెక్టులు గుజరాత్ అభివృద్ధికి తోడ్పడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.


మోదీ పర్యటన సందర్భంగా పలు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీల మధ్య కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తాయి. ప్రాంతీయ అభివృద్ధి వేగంగా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అలానే మోదీ ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌ను ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇది ఒక కొత్త పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ పర్యావరణానికి హాని చేయని పరిశ్రమలు ఉంటాయి. అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ప్రపంచం నలుమూలల నుండి పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa