ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.300 కోట్ల వ్యయంతో దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గా మండపం

national |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 04:45 PM

దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ నగరంలో దేశ చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన దుర్గా మండపం రూపుదిద్దుకుంది. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అద్భుత కట్టడం, భక్తులకు, సందర్శకులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు కళాత్మక మహత్తును కూడా పంచనుంది.ఇందౌర్‌లోని వీఐపీ పరస్పర్‌ నగర్ కాంప్లెక్స్ ప్రాంగణంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ మండపాన్ని నిర్మించారు. ఇందులో దేశంలో ప్రసిద్ధి గాంచిన 12 జ్యోతిర్లింగాలు, ఇతర ప్రముఖ ఆలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిని అనుసరించి ఆలయాలను నెలకొల్పారు.ఈ ప్రతిష్టాత్మక నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 500 మందికి పైగా కళాకారులు మూడు నెలల పాటు అహర్నిశలు శ్రమించారు. మండప నిర్మాణానికి అవసరమైన ఖర్చులను కృష్ణగిరి పీఠాధిపతి వసంత్ విజయానంద్ గిరి మహారాజ్ ఆధ్వర్యంలో భక్తుల విరాళాల ద్వారా సమీకరించారు.ఈ మండపంలో ప్రత్యేక ఆకర్షణగా 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన యాగశాల నిలుస్తోంది. ఇందులో 108 మంది పండితులు నవరాత్రి సందర్భంగా యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa