ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ సుధామూర్తిని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 06:09 AM

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్ధాంగి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తినే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడేందుకు యత్నించారు. కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ అధికారులమని నమ్మించి, ఆమె వ్యక్తిగత వివరాలు రాబట్టడానికి విఫలయత్నం చేశారు. ఈ ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల 5న ఉదయం 9:40 గంటల సమయంలో సుధామూర్తికి ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను కేంద్ర టెలికాం శాఖ ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. ఆమె మొబైల్ నంబర్‌కు ఆధార్ అనుసంధానం కాలేదని, ఆ నంబర్ నుంచి అసభ్యకరమైన సందేశాలు వెళుతున్నాయని ఆరోపించాడు. వెంటనే స్పందించకపోతే మధ్యాహ్నంలోగా నంబర్‌ను బ్లాక్ చేస్తామని బెదిరించాడు. అయితే, ఆ వ్యక్తి ప్రవర్తనపై అనుమానం రావడంతో సుధామూర్తి అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత ఆ నంబర్‌ను ట్రూకాలర్‌లో పరిశీలించగా ‘టెలికాం డిపార్ట్‌మెంట్’ అని కనిపించడం గమనార్హం. ఈ మోసపూరిత యత్నంపై సుధామూర్తి తరఫున గణపతి అనే వ్యక్తి జాతీయ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సెప్టెంబర్ 20న సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa