ఏపీ తల్లికి వందనం పథకం మరింత విస్తరణ – ఆశా, అంగన్వాడీ కుటుంబాలకు సైతం వర్తింపజేత ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని మరింత విస్తరించడానికి చర్యలు తీసుకుంటోంది. గతంలో అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా, పాత ప్రభుత్వం ఈ పథకాన్ని “అమ్మ ఒడి” పధ్ధతిలోనే అమలు చేసింది. అర్హుల జాబితాలను ముందుగానే ప్రకటించి, అవసరమైతే ఫిర్యాదు చేసే అవకాశాన్ని కూడా అందించారు.ప్రస్తుతం ప్రభుత్వం ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే వారి కుటుంబాలకూ తల్లికి వందనం పథకం అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది.
*ప్రధాన వివరాలు:
-రాష్ట్రంలో ఇప్పటి వరకు 66,57,508 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి లబ్ధిదారులు అయ్యారు.
-విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంటర్ మొదటి సంవత్సరానికి చేరిన విద్యార్థులపై పరిశీలన చేసి నిధులు విడుదల చేస్తారు.
-ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమస్యల కోసం వాట్స్యాప్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.
-గతంలో వైసీపీ అమలు చేసిన నిబంధనలను కొనసాగిస్తోందని, 300 యూనిట్లు, ఆప్కాస్ ఉద్యోగులు, భూమి నిబంధనలు ముందే అమలులో ఉన్నాయని లోకేష్ గుర్తు చేశారు.అర్హులందరికీ తల్లికి వందనం పథకం తప్పకుండా వర్తింపజేయబడుతుందని, ఇప్పటి తర్వాత కూడా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కుటుంబాలకూ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు.ఇక SC విద్యార్థుల కోసం కేంద్రం అందించే నగదు, రాష్ట్ర ప్రభుత్వ నిధులను జోడించి అందిస్తామని, డిజిటల్ రేషన్ కార్డులు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిందని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa