టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆసియాకప్ 2025లో చోటు కోల్పోయిన శ్రేయాస్.. టెస్ట్ క్రికెట్లో చోటు సంపాదించడమే లక్ష్యంగా ఇండియా-ఏ తరఫున మ్యాచ్లు ఆడేందుకు నిర్ణయించుకున్నాడు అయ్యర్. ఆస్ట్రేలియా ఏతో జరిగిన తొలి అనధికారిక టెస్ట్లో బరిలోకి దిగి.. విఫలమయ్యాడు. అయితే రెండో టెస్ట్కు ముందు అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. రెండో మ్యాచ్ ఆడట్లేదని బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. దీంతో మ్యాచ్ వేదిక అయిన లక్నో నుంచి ముంబైకి తిరిగి వచ్చేశాడు.
అయితే శ్రేయస్ అయ్యర్ ఇండియా ‘ఏ’ జట్టు కెప్టెన్గా వైదొలగడం క్రికెట్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. చాన్నాళ్లుగా టెస్టుల్లో పునరాగమనం కోసం వేచి చూస్తున్న అయ్యర్కు ఇండియా ‘ఏ’ జట్టు సారథిగా బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఈ సిరీస్లో సత్తాచాటి అతడు.. వెస్టిండీస్తో జరిగే రెండు టెస్ట్ల సిరీస్కు ఎంపికవుతాడని అంతా భావించారు. కానీ ఈ సిరీస్లో రెండో టెస్ట్ నుంచి అయ్యర్ తప్పుకున్నాడు.
అయితే తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో.. శ్రేయస్ అయ్యర్ బీసీసీఐకి లేఖ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. “శ్రేయస్ అయ్యర్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని భావించాడు. ఇదే విషయాన్ని సెలక్టర్లకు లేఖ ద్వారా చెప్పాడు. ఈ నిర్ణయంతో అతడు రానున్న కొన్ని నెలల పాటు అతడు టెస్టు ఫార్మాట్కు దూరంగా ఉండబోతున్నాడు” అని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
వెన్నునొప్పి కారణంగానే అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పితో తాను ఐదు రోజులు ఫీల్డింగ్ చేయలేనని భావించాడని సమాచారం. దీంతో అతడు.. ఈ విషయంపై బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు! ఫలితంగా వెస్టిండీస్తో సిరీస్కు శ్రేయస్ అయ్యర్ దూరమైనట్లు తెలుస్తోంది. అతడు త్వరలోనే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు వెళ్లనున్నాడు. కాగా గతేడాది కూడా వెన్నునొప్పి కారణంగా అయ్యర్.. రంజీ మ్యాచ్లకు దూరమయ్యాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యర్.. టెస్ట్లలో భవిష్యత్లో ఆడతాడా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అతడు చివరిసారి గతేడాది స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ తరఫున ఆడాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa