ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ భారత్పై చావు దెబ్బలు తినింది. అటు ఆన్ ఫీల్డ్లో, ఇటు ఆఫ్ ది ఫీల్డ్లో రెండింటిలోనూ పాక్కు పరాభవం తప్పలేదు. గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తుచిత్తుగా ఓడించగా, అదే మ్యాచ్లో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా భారత్ అవమానించింది. సూపర్ - 4లో కూడా పాక్ ఆటగాళ్ల ఓవరాక్షన్కి బ్యాట్తోనే సమాధానం చెప్పింది. షేక్ హ్యాండ్ వ్యవహారాన్ని పెద్ద వివాదాస్పదం చేసిన పీసీబీ.. చివరికి ఏం చేయలేక కామ్ అయింది.
అయితే, బంగ్లాదేశ్పై సూపర్ - 4లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టిన పాకిస్తాన్.. మ్యాచ్ అనంతరం సెలబ్రేషన్స్ చేసుకుంది. అదే సమయంలో ఓ అభిమాని బౌండరీ లైన్ వద్ద పాక్ పేసర్ హారిస్ రవుఫ్ని పట్టుకుని ఫైనల్లో ఎలాగైనా గెలవాలంటూ బతిమిలాడాడు. దండం పెడుతూ ఎలాగైనా భారత్పై గెలిచి, ప్రతీకారం తీర్చుకోండంటూ వేడుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
"ప్రతీకారం తీర్చుకోవాలి.. భారత్ను వదలకూడదు, ఆ దేవుడిని కూడా వేడుకుంటున్నా" అంటూ ఓ అభిమాని పాక్ పేసర్ హారిస్ రవుఫ్ చేతులు పట్టుకుని మరీ అడిగాడు. రవుఫ్ కూడా ఆ అభిమానికి నవ్వుతూనే సమాధానం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి భారత్ - పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ హిస్టరీలో ఇదే మొట్టమొదటిసారి దాయాదులు ఫైనల్లో ఆడటం. దాంతో ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండటం, ఆటగాళ్ల మధ్య కూడా మాటా మాటా పెరగడంతో ఆసియా కప్ 2025 ఫైనల్స్ మరింత హీటు పుట్టిస్తోంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 28 ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇదే స్టేడియం వేదికగా ఇప్పటికే ఈ టోర్నీలో పాక్ను టీమిండియా చిత్తు చిత్తు చేసింది. మూడోసారి కూడా ఓడించి ట్రోఫీ అందుకోవాలని భారత్ ఎదురుచూస్తుండగా.. సూపర్ - 4లో ఫామ్లోకి వచ్చిన ప్లేయర్లతో ఫైనల్లో భారత్ను ఒత్తిడిలోకి దించేందుకు పాకిస్తాన్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ ఉత్కంఠ పోరు చూసేందుకు ఇరుదేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa