ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేటీఎం కొత్త స్కీమ్.. యూపీఐ, కార్డ్, ఆన్‌లైన్ పేమెంట్స్‌పై గోల్డ్ కాయిన్స్

business |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 11:40 PM

దేశంలో ఇప్పుడు అతిపెద్ద పండగ సీజన్. దసరా, దీపావళి, ధన్‌తేరాస్ వంటి పండగలు ఉన్నాయి. దీంతో కంపెనీలు ఈ సమయంలో కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్, ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం కీలక ప్రకటన చేసింది. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఇక్కడ పేటీఎం నుంచి డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి బెనిఫిట్ ఉంటుంది. మీ డిజిటల్ పేమెంట్స్‌ను.. బంగారంపై పెట్టుబడిగా మార్చే అద్భుతమైన పథకాన్ని లాంఛ్ చేసింది.


ఇక్కడ సరికొత్త గోల్డ్ కాయిన్స్ రివార్డ్స్ ప్రోగ్రామ్ పేరిట దీనిని తీసుకొచ్చింది. ఇక్కడ కస్టమర్లు తాము చేసే ప్రతి డిజిటల్ ట్రాన్సాక్షన్‌పైనా .. గోల్డ్ కాయిన్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. వాటిని నేరుగా డిజిటల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు. అంటే బంగారంపై పెట్టుబడి అవుతుందన్నమాట.


ఎక్కడైనా రివార్డ్స్ అనేది.. క్యాష్‌బ్యాక్ లేదా కూపన్స్ రూపంలో ఉంటాయి. చాలా మంది ఇదే చూసి ఉంటారు. ఇక్కడ పేటీఎం స్కీంలో మాత్రం కాస్త వేరుగా, ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ మీరు రోజువారీగా చేసే ఖర్చులకు చేసే చెల్లింపులతో కూడా మళ్లీ సంపాదించే అవకాశం వస్తుంది. ప్రభుత్వ సంకల్పం.. ఆత్మనిర్భర్ భారత్‌కు కూడా ఊతం అందిస్తుంది. డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ గోల్డ్ కాయిన్స్ ఎలా సంపాదించాలో చూద్దాం.


>> ఇక్కడ ముందుగా పేటీఎం నుంచి చేసే ప్రతి డిజిటల్ పేమెంట్‌పైనా బంగారు నాణేల్ని పొందుతారు. కస్టమర్లు.. వ్యాపారులకు (మర్చంట్లకు) స్కాన్ అండ్ పే విధానంలో.. ఆన్‌లైన్ కొనుగోళ్లు, క్యాష్ ట్రాన్స్‌ఫర్, రీఛార్జ్, బిల్ పేమెంట్స్ వంటి ట్రాన్సాక్షన్లు ఇలా అన్నింటిపైనా ట్రాన్సాక్షన్ విలువలో ఒక శాతం.. బంగారు నాణెంగా మారుతుంది. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఇలా ఏ ట్రాన్సాక్షన్ అయినా వర్తిస్తుంది.


ఇలా 100 బంగారు నాణేల్ని సంపాదిస్తే.. అది రూ. 1 విలువైన 24 క్యారెట్ ప్యూర్ పేటీఎం డిజిటల్ గోల్డ్ ‌కు సమానం అవుతుంది. ఈ నాణేల్ని రిడీమ్ చేసుకునేందుకు.. మరింత బంగారం కొనుగోలు కూడా చేయొచ్చు. పేటీఎం డిజిటల్ గోల్డ్.. ఇక్కడ MMTC- PAMP సహకారంతో డిజిటల్‌గా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు.. నిల్వ చేసేందుకు, విక్రయించేందుకు అనుమతించే అత్యాధునిక పెట్టుబడి ఎంపిక. ఇదే సమయంలో పేటీఎం.. డిజిటల్ గోల్డ్ సహా మరికొన్ని ఫీచర్లను కూడా అప్డేట్ చేసింది. ముఖ్యంగా యుటిలిటీ బిల్స్, ట్యూషన్ ఫీజులు వంటి పునరావృతమయ్యే ఖర్చుల కోసం రిమైండర్స్ తీసుకొచ్చింది. యూపీఐ లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లో.. మొత్తం బ్యాలెన్స్‌ను ఒకే చోట చూసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa