కరూర్లో విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట: 10 మంది మృతి
తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు థలపతి విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని కరూర్లో జరిగిన ఈ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ప్రమాదంలో పార్టీ కార్యకర్తలతో పాటు చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రసంగం జరుగుతున్న సమయంలో భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను నియంత్రించడంలో పోలీసులు మరియు నిర్వాహకులు విఫలమయ్యారు. భారీ జన సమూహంలో కోలాహలం నెలకొనడంతో, పలువురు స్పృహతప్పి కిందపడిపోయారు.పరిస్థితి విషమంగా మారుతున్నట్టు గుర్తించిన విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేశారు. వెంటనే అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరి గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించాయి. పోలీసులు స్థానికులను పరిస్థితిని తేరుకునే వరకు అక్కడకు రాకుండా అప్రమత్తం చేశారు.ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందన ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన, “కరూర్ నుంచి వస్తున్న సమాచారం ఆందోళనకరం. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అవసరమైన మెడికల్ సాయాన్ని వెంటనే అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్కు సూచించాను. కరూర్లో పరిస్థితి సర్వసాధారణంగా మారేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించాను,” అని పేర్కొన్నారు.అలాగే, ప్రజలంతా శాంతంగా ఉండాలని, పోలీసులకు మరియు వైద్య సిబ్బందికి సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa