ప్రస్తుతం ఏసీబీ (ACB) అధికారులకు లంచం ఇస్తూ రైట్ హ్యాండ్గా పట్టుబడితే, కొంతకాలం సస్పెండ్ అయినా, ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరడం చూస్తున్నాం. కొందరు అయితే ప్రమోషన్ కూడా పొందుతున్నారు. కానీ ఒక వ్యక్తి… కేవలం రూ.100 లంచం కేసుతో 39 ఏళ్ల జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. చివరకు 2025లో కోర్టు అతనిని నిర్దోషి అని తేల్చింది. అయితే అప్పటికే అతడి జీవితమంతా నాశనం అయింది. అతని కథ వింటే ఎవరి కన్నీళ్లకైనా ఆగదు.చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయపూర్కు చెందిన జగేశ్వర్ ప్రసాద్ అవాస్తి, 1986లో మధ్యప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బిల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అదే ఏడాది అక్టోబర్ 4న, సహ ఉద్యోగి అశోక్ కుమార్ వర్మ అతనిని బిల్లు పాస్ చేయమని ఒత్తిడి చేసాడు. ఆయన అంగీకరించకపోవడంతో, కుట్రపూరితంగా జేబులో వంద రూపాయలు పెట్టి, విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు వెంటనే వచ్చి లంచం కేసు నమోదు చేశారు.అప్పుడు జగేశ్వర్ ప్రసాద్ దగ్గర సైకిల్, గడియారం, కాపీ పుస్తకాలు తప్ప మరేమీ లభించలేదు. కానీ కేసు దాఖలై, విచారణ ప్రారంభమైంది. 2004లో కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. వెంటనే అప్పీల్ చేసుకున్నా, తీర్పు రావడానికి పూర్తి 21 సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలో, అతను మొత్తం 39 ఏళ్లు జైల్లో గడిపాడు.ఈ కాలంలో అతని జీవితమే కాదు, కుటుంబం కూడా పూర్తిగా చితికిపోయింది. కేసు నమోదయ్యాక జగేశ్వర్ను సస్పెండ్ చేశారు. కుటుంబ ఆదాయం ఆగిపోయింది. భార్య కుటుంబాన్ని పోషించలేక బాధతో తలవంచింది. చివరకు ఆవేదనతో మరణించింది. తల్లి మృతితో పిల్లలు చదువు మానేసి బతుకుదెరువు కోసం చెదరిపోయారు.పెద్ద కుమారుడు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఎలా గానో నెట్టుకొస్తున్నాడు. కుమార్తెలకు ఏదోలా పెళ్లిళ్లు చేశాడు. కానీ ఈ కుటుంబం ఎక్కడికెళ్లినా "మీ తండ్రి లంచం తీసుకున్నవాడు" అని హేళన ఎదురైంది. ఈ అవమానాలతో పిల్లలు మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు.తీరా ఇప్పుడు కోర్టు జగేశ్వర్ ప్రసాద్ను నిర్దోషిగా ప్రకటించిందని చెప్పినా, ఆయనకు మిగిలిందేమీ లేదు. కనీసం తన పేరుమీద ఒక ఇల్లు కూడా లేదు. ఓ చిన్న ఇరుకైన ఇంట్లో చిన్న కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. భార్యను కోల్పోయిన బాధ, పిల్లల నష్టాల్ని చూసిన కన్నులు… న్యాయం ఆలస్యంగా వచ్చినా, ఆ న్యాయానికి విలువ తగ్గిపోయింది.జగేశ్వర్ ప్రసాద్ ప్రస్తుతం ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాడు – తనకు కనీసం పింషన్ అయినా ఇవ్వాలని, కొంత న్యాయం చేయాలని కోరుతున్నాడు. కానీ అతడికి పోయిన జీవితం తిరిగి రావడం సాధ్యం కాదు. అతడి జీవితం ఒక గొప్ప ఉదాహరణ – న్యాయం ఆలస్యం అయితే అది న్యాయం కాదని.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa