ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రైన్‌లో జనరల్ రిజర్వేషన్‌కూ ఆధార్ తప్పనిసరి

national |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 11:21 AM

రైలు టికెట్‌ జనరల్‌ రిజర్వేషన్‌కూ ఇకపై ఆధార్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి కానుంది. ఈ నిబంధన బుధవారం నుంచే అమలులోకి వచ్చింది. జనరల్‌ రిజర్వేషన్‌ ఓపెనైన తొలి 15 నిమిషాల వరకు ఈ రూల్‌ వర్తిస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లలో టికెట్‌ బుక్‌ చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. బ్రోకర్లు, ఏజెంట్ల వల్ల సాధారణ ప్రయాణికులకు టికెట్లు దక్కడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, టికెట్‌ కౌంటర్లలో రిజర్వేషన్‌ చేసుకునే వారికి మాత్రం ఆధార్‌ అవసరం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa