ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలలకి ఇస్తానన్న ఆడబిడ్డ నిధి, సున్నా వడ్డీ రుణాలు ఎక్కడ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 01:27 PM

హామీలతో మభ్యపుచ్చిన చంద్రబాబు సర్కారు మరోసారి మహిళలను దారుణంగా దగా చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు స్పందిస్తూ.... ఇప్పటికే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను పూర్తిగా రద్దు చేసిన కూటమి ప్రభుత్వం 1.80 కోట్ల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి.. కోటి మందికిపైగా పొదుపు మహిళలకు సున్నా వడ్డీని ఎగరగొట్టింది. తాను అధికారంలోకి వస్తే సున్నా వడ్డీని రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తామన్న ఎన్నికల హామీపై సీఎం చంద్రబాబు ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరి­స్తున్నారు. ఈ మోసాలు ఇంతటితో ఆగడం లేదు. ఒకపక్క ఎన్నికల హామీలను నెరవేర్చకుండా.. మరో­పక్క ఆర్బీఐ, చట్ట నిబంధలనకు విరుద్ధంగా ‘స్త్రీనిధి’కి ఎసరు పెడుతున్నారు. స్త్రీనిధి నుంచి మహిళలకు హక్కుగా రావాల్సిన డబ్బులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి తిరిగి వసూలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికీ.. ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఓ ఇంట్లో 18 ఏళ్లు దాటిన మహిళలు ఇద్దరు ఉంటే ఏటా రూ.36 వేల చొప్పున ఇవ్వాలి.. అదే నలుగురు ఉంటే రూ.72 వేలు ఇవ్వాల్సి ఉండగా ఈ పథకాన్ని ఎగరగొట్టింది. ఆడబిడ్డ నిధి పథకాన్ని 16 నెలలు దాటినా అమలు చేయలేదు. మరోవైపు.. వైఎస్సార్‌ సీపీ హయాంలో ఐదేళ్లపాటు పొదుపు సంఘాల మహిళలకు అమలు చేసిన సున్నా వడ్డీ పథకం సైతం కూటమి సర్కారు వచ్చాక నిలిచిపోయింది అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa