ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరికి న్యాయమే గెలుస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 01:31 PM

లిక్క‌ర్ అక్ర‌మ కేసులో న్యాయ‌మే గెలిచింద‌ని మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి పేర్కొన్నారు. రాజంపేట పార్లమెంటు సభ్యుడు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్  మంజూరు చేయడంపై  నారాయణస్వామి ఆధ్వర్యంలో జీడి నెల్లూరు మండల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంబ‌రాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌స్వామి మాట్లాడుతూ..  మిధున్ రెడ్డి పై కూటమి ప్రభుత్వం అక్రమ లిక్కర్ కేసు అంటగట్టి జైలు పాలు చేసింద‌ని మండిప‌డ్డారు.  చివ‌ర‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషంగా ఉంద‌న్నారు.కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు ముని రాజారెడ్డి, మాజీ కార్పొరేషణ్ డైరెక్టర్ గుణశేఖర్ రెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఏకాంబరం, మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ వేలు మొదలియార్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు కిషోర్ రెడ్డి, నియోజకవర్గ ఆర్టిఐ విభాగం అధ్యక్షుడు ఢిల్లీ కుమార్, మోహన్, వినోద్, శ్రీ రంగరాజపురం మండల నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa