ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

business |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 11:49 PM

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. మానీటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలోని వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించినట్లు తెలిపింది. రెపో రేటును మరోసారి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఆర్‌బీఐ ఎంపీస సమావేశంలోని నిర్ణయాలపై మీడియాకు వెల్లడించారు. రెంపో రేటును 5.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలోని కీలక నిర్ణయాలను తెలుసుకుందాం.


ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇది నాలుగో ద్వైమాసిక మానీటరీ పాలసీ కమిటీ సమావేశం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఈ భేటీ సెప్టెంబర్ 29వ తేదీన మొదలై అక్టోబర్ 1వ తేదీ వరకు జరిగింది. రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షా సమావేశాల్లో 0.25 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. జూన్ నెలలో నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మూడు వరుస సమావేశాల్లో మొత్తం 1 శాతం వడ్డీ తగ్గించింది. ఆ తర్వాత ట్రంప్ టారిఫ్ ప్రకటనలు, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఆగస్టు నెలలో జరిగిన సమావేశంలో వడ్డీ రేట్లను 5.5 శాతం వద్దే యథాతథంగా ఉంచింది. ఇప్పుడు మరోసారి అదే వడ్డీ రేట్లను కొనసాగించాలని నిర్ణయించింది.


ఇక ఈ ఆర్థిక సంవత్సరం FY26 జీడీపీ వృద్ధి అంచనాలను 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది. ఇక త్రైమాసికాల వారీగా చూసుకుంటే క్యూ2లో 6.7 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. క్యూ3లో 6.6 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. క్యూ4లో 6.3 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గించింది. ఇక వచ్చే ఆర్థిక ఏడాది FY27 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాలను 6.6 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది.


ఇక 2026- 27 ఆర్థిక సంవత్సరానికి గానూ వినియోగదారుల ధరల ఆధారిత సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతం లేదా అంత కంటే దిగువ స్థాయిలో ఉండవచ్చని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. జీఎస్‌టీ హేతుబద్ధీకరణతో అక్టోబర్ నెలలో అది మరింత తక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంది. దాంతో కీలక వడ్డీ రేట్లను మరో 256 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించవచ్చని అంచనా వేసింది. అయితే, అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించకుండా యథాతథంగా కొనసాగిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa