ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ పనితీరుపై ప్రశంసలు కురిపించిన ఏఎస్ఎంఎల్ సంస్థ

international |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 02:12 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు, వ్యాపార అనుకూల వైఖరిపై ప్రపంచ ప్రఖ్యాత సెమీకండక్టర్ల తయారీ సంస్థ ఏఎస్ఎంఎల్ ప్రశంసల వర్షం కురిపించింది. పెట్టుబడుల విషయంలో ప్రధాని మోదీ చాలా చొరవ తీసుకుంటారని, కంపెనీల అభిప్రాయాలకు ఎంతో విలువ ఇస్తారని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఫ్రాంక్ హీమ్స్‌కెర్క్ కొనియాడారు.బ్రస్సెల్స్‌లో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ కంపెనీ సీఈవో క్రిస్టోఫ్ ఫౌకేతో ప్రధాని మోదీ దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారని గుర్తుచేశారు. ఆ సమావేశంలో మోదీ కేవలం తాము చెప్పింది వినడమే కాకుండా, "మీరు చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నారు. మేం ఇంకా మెరుగ్గా ఏం చేయాలో సూటిగా చెప్పండి" అని అడిగారని హీమ్స్‌కెర్క్ వెల్లడించారు. మోదీ నిక్కచ్చి వైఖరి తమను ఆకట్టుకుందని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa