తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మత్తు పదార్థాల వినియోగం మీద కఠినంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్ తీసుకున్నా.. అమ్మినా ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేసింది. మాదక ద్రవ్యాల కట్టడి కోసం ప్రత్యేకంగా ఈగల్ టీమ్ను ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు నిర్వహించి.. పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను పట్టుకుంటున్నారు. తాజాగా ఓ ట్రావెల్ బస్సులో రూ.50 లక్షల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు..
తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గురువారం రాత్రి ఓ ట్రావెల్స్ బస్సులో రూ..50 లక్షల ఖరీదైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం నాడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చెక్పోస్ట్ దగ్గర వెలుగు చూసింది. గోవా నుంచి హైదరాబాద్కు.. ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 50 లక్షల నైట్రో జెఫమ్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దసరా పండుగ నాడు రాత్రి సమయంలో జహీరాబాద్ చెక్ పోస్ట్ దగ్గర ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు 50 లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ని గుర్తించారు.
రూ. 50 లక్షల విలువైన నైట్రో జెఫమ్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా లాభం లేకుండా పోతుంది. నిందితులు ఏదో రూపంలో మాదకద్రవ్యాలను తరలిస్తూనే ఉన్నారు.
తాజాగా నాలుగు రోజుల క్రితం రాచకొండ కమిషనరేట్ పరిధి అబ్దుల్లాపూర్ మెట్లో రూ.6 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. డీసీఎంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సిమెంట్ బ్యాగుల మధ్యలో గంజాయి తరలిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 6 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు .
అలానే రెండు రోజుల క్రితం పెద్ద అంబర్పేట వద్ద డీసీఎం వాహనంలో కొబ్బరి బొండాల చాటున గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ సుమారు రూ.2 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు ఏపీ నుంచి రాజస్థాన్కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి.. మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa