అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్.. ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో.. రెండో రోజే మ్యాచ్పై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీలతో భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 448 రన్స్ చేసింది. ప్రస్తుతం లీడ్ 286 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో ఓడిపోకుండా ఉండాలంటే వెస్టిండీస్ అద్భుతం చేయాల్సిందే.
కేఎల్, జురెల్, జడ్డూ శతకాల మోత..
ఓవర్ నైట్ స్కోరు 76తో రెండో రోజు బ్యాటింగ్కు దిగిన కేఎల్ రాహుల్.. కెరీర్లో 11వ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఇక 189 బంతుల్లో మూడంకెల మార్కును అందుకున్న అతడు.. సెంచరీ చేసిన కాసేపటికే పెవిలియన్ చేరాడు. ఇక పంత్ గాయంతో దూరం కావడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న ధ్రువ్ జురెల్.. తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. సెంచరీతో కదం తొక్కాడు. టెస్టుల్లో నంబర్ వన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా మూడంకెల మార్కును అందుకున్నాడు.
ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడంతో.. భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 210 బంతుల్లో 125 రన్స్ చేసిన తర్వాత జురెల్ ఔట్ అయ్యాడు. అయితే సెంచరీ చేశాక.. అతడు చేసుకున్న సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆర్మీ అధికారి కొడుకైన జురెల్.. సెల్యూట్ చేస్తూ సంబురాలు చేసుకున్నాడు. జురెల్కు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఇక రవీంద్ర జడేజా సైతం తన మార్క్ సెలబ్రేషన్స్తో అలరించాడు. కత్తి తిప్పినట్లు బ్యాట్ తిప్పుతూ ఫ్యాన్స్ను కుషీ చేశాడు.
బ్యాటింగ్లో తేలిపోయిన వెస్టిండీస్ ప్లేయర్లు.. బౌలింగ్లోనూ అదే రిపీట్ చేస్తున్నారు. భారత బ్యాటర్లు ఆడే షాట్లకు విండీస్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దీంతో వికెట్లు తీసేందుకు వారు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో విండీస్.. 162 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా.. 5 వికెట్ల నష్టానికి 448 రన్స్ చేసింది. ప్రస్తుతం భారత్ లీడ్.. 286 పరుగులుగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa