విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వైయస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. జడ్పీ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన విశాఖ జడ్పీ సర్వ సభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసన మండలి ప్రతి పక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యే మత్స్య లింగం, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ..` విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని నేను అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కుమారస్వామి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఆందోళనకరంగా ఉంది. కూటమి నేతలు మాత్రం ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని మభ్యపెట్టడం విడ్డూరం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ మీద వైయస్ఆర్సీపీ పోరాడుతుంది` అని బాబూరావు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa