ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ ఉత్సవాల పేరుతో అధికార నేతలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 01:48 PM

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... సీఎం చంద్రబాబు మాత్రం తమ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటూ అబద్దాలు చెబుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విజయవాడ ఉత్సవాల పేరుతో కూటమి నేతలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని..  ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయిందే చెప్పాలని నిలదీశారు. అయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతే తొలిసారి ఉత్సవాలు జరుగుతున్నట్టు.. సంబరాలు చేసుకోవడం ఇదే మొదటిసారి అన్నట్టు చంద్రబాబు తన ప్రసంగంలో బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ రకంగా సంతోషంగా ఉన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేశారా? ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించారా? అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని కూడా విస్మరించారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగభృతి ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ కూడా పూర్తి చేయలేదు. రైతులు, మహిళలు, విద్యార్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఒకవైపు సంక్షేమకార్యక్రమాలు లేక, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... చంద్రబాబునాయుడు మాత్రం సంవత్సరం ఐదు నెలల క్రితం రాష్ట్రంలో విధ్వంసం ఉండేది, ఎవరూ సంతోషంగా లేరు, నేను వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారంటూ పచ్చి అబద్దాలు చెబుతున్నారు అని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa