ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి.. పెళ్లైన ఆరు రోజులకు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదం నింపింది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న యువతి.. ఆరు రోజులకే చనిపోవడం ప్రతి ఒక్కరిని బాధపెడుతుంది. పోలీసుల దర్యాప్తులో యువతి ఆత్మహత్యకు కారణాలు తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇలాంటి కారణాలకు కూడా చనిపోతారని ఆశ్చర్యపోతున్నారు. మటన్ కూరలో కారం ఎక్కువైందనే కారణంతో దంపతులు గొడవపడ్డారని.. దీంతో మనస్థాపం చెందిన గంగోత్రి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
గంగోత్రి, సంతోష్ దంపతులకు సెప్టెంబర్ 26న వివాహం జరిగింది. ఈ క్రమంలో దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 2న గంగోత్రి తన భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో మటన్ కూర అంశంలో భార్యాభర్తలిద్దరికి గొడవ అయ్యిందని పోలీసులు తెలిపారు. గంగోత్రి మటన్లో కూరలో కారం ఎక్కువ వేసినందుకు సంతోష్ ఆమె మీద అరిచాడని.. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారిందని తెలిపారు. అది కాక గంగోత్రి తమ ఇంటి దగ్గర మటన్ తినలేదని.. మరి పుట్టింటిలో చికెన్ ఎలా తింటుందని సంతోష్ ప్రశ్నించాడని తెలిపారు. దీంతో గంగోత్రి తల్లిదండ్రులు.. తమ కుమార్తె మటన్ తినదని.. చికెన్ మాత్రమే తింటుందని అతడికి తెలిపారు
ఆ గొడవ తర్వాత గంగోత్రి తన భర్త సంతోష్తో కలిసి అత్తారింటికి వెళ్లింది. అక్కడ కూడా ఇదే అంశంపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని వెల్లడించారు. తీవ్ర మనస్థాపానికి గురైన గంగోత్రి.. గురువారం అర్ధరాత్రి ఇంట్లో అందరు నిద్ర పోయిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఇంత చిన్న కారణానికే గంగోత్రి ప్రాణాలు తీసుకోవడం సంచలనంగా నిలిచింది. భోజనం దగ్గర జరిగిన గొడవలు మనసులో పెట్టుకొనే.. సంతోష్ తన కుమార్తెని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం వల్లే తమ కుమార్తె మరణించిందని గాయత్రి తల్లి శారద ఆరోపిస్తోంది.
జగిత్యాల జిల్లాఎర్దండి గ్రామానికి చెందిన అల్లెపు గంగోత్రి(22) అనే యువతి.. అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడిని ప్రేమించి.. పెద్దల అంగీకరంతో వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో సెప్టెంబరు 26న వీరి వివాహం జరిగింది. ఇదిలా ఉండగా దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 2న గంగోత్రి తన భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భర్తతో నాన్ వెజ్ విషయంలో గొడవ జరిగింది. అది కాస్త ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. దీంతో మనస్థాపం చెందిన గంగోత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa