ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికార మదంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వారికీ రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 04:55 PM

అన్యాయానికి గురైన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యూఆర్‌ కోడ్‌తో కలిగిన డిజిటల్‌ బుక్‌ను ఆవిష్కరించారని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  తెలిపారు. అధికార మదంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, వీరి అండ చూసుకుని పక్షపాతంతో వ్యవహరిస్తున్న అధికారుల భరతం పట్టేందుకే డిజిటల్‌ బుక్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.  నెల్లూరు న‌గ‌రంలోని 9వ డివిజ‌న్‌లో  పార్టీ ముఖ్య నేతలతో కలిసి డిజిటల్‌ బుక్‌ క్యూఆర్‌ పోస్టర్‌ను ఆయ‌న ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ..వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టిన, పెట్టే వారిపై ఫిర్యాదు చేసేందుకు డిజిటల్‌ బుక్‌ ఒక అస్త్రమన్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారిపై కార్యకర్తలు, ఈ బుక్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చునన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు ఫిర్యాదు చేసిన వారిపై తప్పకుండా శిక్ష పడేలా చర్యలు ఉంటాయన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa