పీఓకే భారతదేశం అనే ఇంట్లోని ఒక గది అని, దానిని ఇతరులు ఆక్రమించుకున్నారని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. పీఓకేలో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, హింస చెలరేగుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.మధ్యప్రదేశ్లోని సత్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు. "భారతదేశం మొత్తం ఒకే ఇల్లు. కానీ మన ఇంట్లోని ఓ గదిని ఎవరో ఆక్రమించుకున్నారు. ఆ గదిలో నా టేబుల్, కుర్చీ, బట్టలు ఉండేవి. దానిని నేను తిరిగి స్వాధీనం చేసుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన మాటలకు సభలో పెద్ద ఎత్తున చప్పట్లు మారుమోగాయి. దేశ విభజన సమయంలో సింధ్ ప్రాంతం నుంచి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, వారు అవిభక్త భారతదేశం నుంచే వచ్చారని గుర్తుచేశారు.అంతకుముందు, పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అంతర్జాతీయ స్పందనలను ప్రస్తావించిన భగవత్, ప్రపంచ వేదికపై మన మిత్రులెవరో ఈ ఘటన తేల్చిందని అన్నారు. దేశ భద్రతా సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa