ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీసీపై విమర్శలు చేసిన మైఖేల్ అథర్టన్

sports |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 04:58 PM

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్ల డ్రా విధానంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి మేజర్ టోర్నీలో కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే భారత్, పాకిస్థాన్‌ జట్లను ఒకే గ్రూపులో ఉంచుతున్నారని, ఈ పద్ధతికి స్వస్తి పలికి డ్రాలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశాడు.ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్‌లో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఆటపై ప్రభావం చూపిన నేపథ్యంలో అథర్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ఐసీసీ ఈవెంట్లలో చాలా ఏళ్లుగా భారత్, పాకిస్థాన్‌లను ఒకే గ్రూపులో చూడటం పరిపాటిగా మారింది. దీని వెనుక ఉన్న కారణాలను ఐసీసీ ఎప్పుడూ స్పష్టంగా వివరించలేదు. కేవలం ఈ రెండు జట్ల మధ్య కనీసం ఒక మ్యాచ్ అయినా జరిగేలా చూడటానికే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది" అని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa