ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం

national |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 05:04 PM

దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఎన్నికల నగారా మోగనుంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌కు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రకటించనుంది. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికల తేదీలను వెల్లడించనుంది.ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగియనుండటంతో, ఆలోపే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, అక్టోబర్ చివరిలో జరిగే ఛఠ్ పూజ పండుగ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి. పండుగకు ఇతర రాష్ట్రాల నుంచి సొంత ఊళ్లకు వచ్చేవారితో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆ పార్టీలు సూచించాయి.ఇటీవల భోజ్‌పురిలో ప్రసంగం ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ ఎన్నికల కోసం కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యను 1,200కు పరిమితం చేశామని, బ్యాలెట్‌పై అభ్యర్థుల ఫోటోలను ఇకపై బ్లాక్ అండ్ వైట్‌లో కాకుండా కలర్‌లో ముద్రిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఛఠ్ పూజ తరహాలోనే ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన బిహార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa