ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయెల్, హమాస్‌ దేశాలకి హెచ్చరిక జారీచేసిన ట్రంప్

international |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 05:05 PM

గాజా శాంతి ప్రణాళిక విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రాకపోతే భారీ రక్తపాతం చూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, హమాస్‌లను తీవ్రంగా హెచ్చరించారు. ఈజిప్టు వేదికగా ఇరు పక్షాల మధ్య కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో, ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందంపై వేగంగా ముందుకు సాగాలని ఆయన ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు."ఈ శతాబ్దాల నాటి సంఘర్షణను నేను నిశితంగా గమనిస్తున్నాను. సమయం చాలా విలువైంది. లేదంటే, ఎవరూ కోరుకోని భారీ రక్తపాతం జరుగుతుంది. అందరూ వేగంగా కదలాలని నేను కోరుతున్నాను" అని ట్రంప్ తన పోస్టులో స్పష్టం చేశారు. హమాస్‌తో పాటు ఇతర అరబ్, ముస్లిం దేశాలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, బందీల విడుదల, గాజాలో యుద్ధం ముగింపు వంటి అంశాలపై సానుకూల వాతావరణం నెలకొందని ఆయన తెలిపారు. ప్రణాళికలోని తుది వివరాలను ఖరారు చేసేందుకు నేడు ఈజిప్టులో సాంకేతిక బృందాలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa