ఇండియా-పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ లో భయం పెరిగింది. తాజాగా పాకిస్తాన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నాజర్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అతను, ఇండియా ఏ క్షణమైనా పాకిస్తాన్ పై మిస్సైల్ దాడి చేయవచ్చని చెప్పారు. ఈసారి జరగబోయే దాడి ‘ఆపరేషన్ సింధూర్’ కంటే ఎక్కువ తీవ్రతతో ఉండే అవకాశం ఉందని పాకిస్తాన్ లోని రాజకీయ నాయకులను కూడా హెచ్చరించారు. పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని నాజర్ ఖాన్ స్పష్టం చేశారు.దీనితో పాటు మరో సంఘటన ఇండియా-పాకిస్తాన్ సంబంధాల్లో ఉద్రిక్తతను పెంచింది. లష్కర్-ఎ-తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. సైఫుల్లా భారతదేశాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, భారత్కు గుణపాఠం చెప్పాల్సిందని తేల్చి చెప్పారు. ఒక ర్యాలీలో భారత్ని తొక్కిపడేయాలని ఆవేశపూరితంగా అన్నారు.మరోవైపు, సోమవారం పాక్ రక్షణ మంత్రి కూడా భారతదేశంపై ఘాటు వ్యాఖ్యలు చేసి, ‘భారతదేశాన్ని సమాధి చేస్తామంటూ’ తీవ్ర భణలు ఇచ్చారు. పాక్ నేతల ఆవేశపూరిత వ్యాఖ్యలకు భారత్ సైతం ఘన కౌంటర్ ఇస్తోంది. ఉగ్రవాద చర్యలు ఆపకపోతే పాకిస్తాన్ను మ్యాప్ నుండి తొలగిస్తామని ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa