దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు PM కిసాన్ యోజన 21వ విడత నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో 20వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఆగస్ట్ 2న వారణాసిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా, తదుపరి విడత డబ్బులు నవంబర్-డిసెంబర్ మధ్యలో రైతుల ఖాతాల్లో జమ అవుతుంటాయి. కానీ ఈసారి మాత్రం దీపావళి పండుగకు ముందే విడుదల అయ్యే అవకాశముందని పలు వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనివల్ల రైతులకు పండుగ సమయానికి ఆర్థికంగా ఉపశమనం లభించే అవకాశం ఉంది.ఇప్పటికే వర్షాలు, వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని సుమారు 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున నిధులు జమ అయినట్లు సమాచారం. ఈ ముందస్తు విడుదలను ప్రత్యేక పరిస్థితులపై కేంద్రం తీసుకున్న నిర్ణయంగా చెబుతున్నారు.అయితే, ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలూ, ప్రక్రియలూ తప్పనిసరి. ముఖ్యంగా ఇ-కేవైసీ (e-KYC) తప్పనిసరి. అదనంగా, ఆధార్ & బ్యాంక్ ఖాతా లింకింగ్, ఖాతా వివరాలు సరైనవిగా ఉండాలి. వాస్తవ సమాచారం ఇవ్వకపోతే లేదా అనర్హులుగా గుర్తించబడితే, ఉదాహరణకు – 2019 తర్వాత భూమిని కొనుగోలు చేసినవారు – వారికి డబ్బులు జమ కాబోవు.రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే, PM-KISAN అధికారిక వెబ్సైట్ (pmkisan.gov.in) ఓపెన్ చేయాలి. హోమ్పేజీలో "Beneficiary List" అనే ఆప్షన్ను క్లిక్ చేసి, రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలు ఎంటర్ చేసి "Get Report" బటన్పై క్లిక్ చేస్తే, లిస్టులో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు.గమనించవలసిన విషయమేమంటే, ఈసారి నిధులు ఒక్కేసారి అందరికీ జమ కావడం కుదరకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే డబ్బులు జమ కాగా, మిగతా రాష్ట్రాల్లో దీపావళికి ముందు లేదా పర్వదినాల నాటికి విడుదల అవుతాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి, రైతులు ముందుగా తమ అర్హతను చెక్ చేసుకుని అవసరమైన సమాచారం అప్డేట్ చేసుకోవడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa