టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టనున్నారు. వీరిద్దరూ చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జెర్సీ ధరించి ఆడారు. ఆ తర్వాత టెస్టులకు రిటైర్మెంట్ పలకడంతో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్.. టీ20లకు వీడ్కోలు పలకడంతో ఆసియాకప్ 2025 ఆడలేదు. వీరిద్దరూ ప్రస్తుతం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027లో ఆడటమే లక్ష్యంగా వీరిద్దరూ అడుగులు వేస్తున్నారు.
అయితే.. తర్వాతి వన్డే ప్రపంచకప్లో ఆడాలనే వీరి కల నెరవేరడం కష్టంగానే కనిపిస్తోంది. వయసు దృష్ట్యా వారిద్దరూ మరో రెండేళ్లు ఫామ్ కొనసాగించడం కాస్త ఇబ్బందే. అంతేకాకుండా ఇటీవల రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం కూడా ఊహాగానాలకు తెరలేపింది. ఇదే విషయంపై దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ మాట్లాడాడు. కోహ్లీ, రోహిత్ శర్మలు వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడేది అనుమానమే అని వ్యాఖ్యానించాడు.
“వన్డే ప్రపంచకప్ 2027లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారనే గ్యారంటీ లేదు. శుభ్మన్ గిల్ను వన్డే కెప్టెన్ చేయడం కూడా దానిలో ఒక భాగమే అనిపిస్తోంది. శుభ్మన్ గిల్ యువ ఆటగాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. అద్భుతమైన నాయకుడు. ఏది ఏమైనా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం కోహ్లీ, రోహిత్ను జట్టులోకి తీసుకోవడం అభినందించదగ్గ విషయం. ఎంతో అనుభవం ఉన్న వీరిద్దరి నుంచి గిల్.. ఎన్నో విషయాలు నేర్చుకునేందుకు ఆస్కారం ఉంది. ఈ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగనుంది” అని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డారు.
“రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. మరో వరల్డ్ కప్ ఆడాలని భావిస్తున్నారు. కానీ అది అంత ఈజీగా కాదు. అది జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే టోర్నీ ప్రారంభానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాలంటే వీరిద్దరూ వారు ఆడే మ్యాచ్లలో సత్తాచాటాలి. ఫామ్ కంటిన్యూ చేయాలి” అని మిస్టర్ 360 వ్యాఖ్యానించాడు. అక్టోబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో రాణిస్తేనే.. రో-కోలు భారత వన్డే జట్టులో ఉండే అవకాశం ఉంది. అలా జరగకపోతే.. మాత్రం వారికి టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కడం కష్టం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa