రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ టీడీపీ నడిపిస్తున్న కుటీర పరిశ్రమగా మారిపోయిందని, సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్తీ లిక్కర్ తయారీని వ్యవస్థీకృతం చేశారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ కల్తీ లిక్కర్ తయారు చేయడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి కూడా గండికొట్టి మరీ ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి టీడీపీ నాయకుల ద్వారా ఈ కల్తీ దందాను నడిపిస్తున్నాడని, బెల్ట్ షాపుల ద్వారా పంపిణీ చేసి ప్రజలతో తాగిస్తున్నాడని ఎమ్మెల్యే తాటిపర్తి వివరించారు. మొలకలచెరువు కల్తీ లిక్కర్ స్కాంలో పట్టుబడిన తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డిని వైయస్ఆర్సీపీ కోవర్టు అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. సీఎం చంద్రబాబు కల్తీ లిక్కర్పై ప్రజలకు సమాధానం చెప్పలేక పదవుల ఆశ చూపించి పట్టాభిని మీడియా ముందుకు పంపించి నోటికొచ్చినట్టు మాట్లాడిస్తున్నాడని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే ముందు పట్టాభి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని, లేదంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు తానే బాధ్యుడవుతాడని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa