వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటే సీఎం చంద్ర బాబుకు భయమని.. అందుకే మెడికల్ కళాశాల పరిశీలించడానికి వెళ్తున్న తమ అధినేత పర్యటనకు ఆంక్షలు విధిస్తూ అడ్డుకుంటున్నారంటూ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్, మాజీమంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. విశాఖలో బుధవారం మాజీ మంత్రులు గుడివాడ అమర్ నాథ్, విడదల రజినీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ పర్యటన యథావిధిగా కొనసాగుతుందని కన్నబాబు తేల్చి చెప్పారు. ఈ పర్యటనకు వెళ్లకుండా తమ పార్టీ నాయకులకు ఫోన్చేసి పోలీసులు బెదిరిస్తున్నారని.. ఇలా చేస్తే వైయస్ జగన్ పర్యటన ఆగుతుందని అనుకుంటే అది వారి అవివేకమన్నారు. వైయస్ జగన్ తిరుగు ప్రయాణంలో కేజీహెచ్లో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శిస్తారని చెప్పారు. రజినీ, అమర్నాథ్ మాట్లాడుతూ వైయస్ జగన్ పర్యటనకు గాజువాక, కూర్మన్నపాలెం, అనకాపల్లి మీదుగా నర్సీపట్నం వెళ్లేం దుకు అనుమతి అడిగామని.. కానీ పోలీసులు రూటు మార్చారన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్ కలవకూడదనే ఇలా మార్చారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa