ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు కేవలం 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి బలహీన పరిస్థితిలో పడింది.మంధాన, హర్మన్ ప్రీత్, ప్రతీక, దీప్తి శర్మ వంటి కీలక బ్యాటర్లు త్వరగా అవుట్ కావడంతో, టీమిండియా 150 పరుగుల మార్క్ దాటడం కష్టం అవుతుందని అనిపించింది. అయితే ఈ సంక్షోభ సమయంలో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ అద్భుతంగా ఎదురుదాడి చేసింది.తన పోరాటంతో స్కోరు బోర్డు పరిగెత్తించింది. వికెట్లు పడినప్పటికీ ప్రత్యర్థి బౌలర్లపై విరోచితంగా ఆడుతూ, కేవలం 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేసిన రిచా ఓ దశలో సెంచరీ మార్క్ అందుకోవడానికి సైతం దగ్గరగా వెళ్లింది. చివరి ఓవర్లో భారీ షాట్ ప్రయత్నంలో వికెట్ కోల్పోయింది.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీచరణి కూడా త్వరగా అవుట్ కావడంతో, భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్తో టీమిండియాకు ఫైటింగ్ టోటల్ అందించింది.భారత బ్యాటర్లలో రిచా ఘోష్తో పాటు ప్రతికా రావల్ 37, స్నేహ్ రాణా 33 పరుగులతో కీలక పాత్ర పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్లోయ్ ట్రయాన్ మూడు వికెట్లు పడగొట్టగా, మారిజాన్ కాప్, మల్బా, నాడిన్ డి క్లెర్క్ ఇద్దరు వికెట్లు each తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa