వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్లలో వేల కోట్లు దోచుకున్నారని.. ఇంకా సరిపోలేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్కి ఐదేళ్లు అధికారం ఇస్తే... ఏమి చేయలేక.. ఇప్పుడు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో జీఎస్టీ 2.0 ఫలితాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ (శుక్రవారం) విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు . పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేస్తే జగన్ అండ్కో కు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కోర్టు జగన్కి మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం జగన్కి ఇష్టం లేదని ధ్వజమెత్తారు. నిన్న మెడికల్ కాలేజీ మొండి గోడలు చూడటానికే జగన్ వెళ్లారని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa