కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అందులో ఎక్కువ మంది రైలు ప్రయాణాలు చేసి తిరుపతికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు కాలినడకన, ఘాట్ రోడ్లలో.. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు చేరుకుంటారు. శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అందుకే తిరుపతికి వెళ్లే రైళ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా సెలవు రోజుల్లో అయితే తిరుపతికి వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతూ ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతూ ఉంటుంది. ఇక దేశంలోని ముఖ్యమైన నగరాల నుంచి తిరుపతికి రైళ్లు నడుపుతోంది రైల్వే శాఖ. ఈ క్రమంలోనే చెన్నై నుంచి కూడా తిరుపతికి రైళ్లు నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే తిరుపతి చెన్నై సెంట్రల్ స్టేషన్ మధ్యన నడిచే రైళ్లకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్కు వెళ్లే రైలు తిరుపతికి బదులుగా తిరుచానూరు నుంచి బయల్దేరనుంది. దక్షిణ రైల్వే ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రైల్వే మరమ్మతు పనుల నేపథ్యంలో చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి వెళ్లే అన్ రిజర్వ్డ్ రైళ్ల సేవలకు సంబంధించి మార్పులు చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. ఈ మార్పుల ప్రకారం అరక్కోణం నుంచి తిరుపతికి వచ్చే రైలు శుక్రవారం నుంచి వచ్చే నెల 5వ తేది వరకు తిరుపతి రైల్వేస్టేషన్కు బదులుగా తిరుచానూరు రైల్వేస్టేషన్ వరకు నడవనున్నట్లు దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.
అలాగే తిరుపతి నుంచి అరక్కోణం బయల్దేరే రైలు సేవలలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి అరక్కోణం రైలు తిరుపతికి బదులుగా తిరుచానూరు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుంది. ఇదే విధంగానే తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే రైలు కూడా తిరుపతి రైల్వేస్టేషన్ బదులుగా తిరుచానూరు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుందని.. అలాగే చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి రైల్వేస్టేషన్కి వచ్చే రైలు తిరుపతికి బదులుగా తిరుచానూరు రైల్వేస్టేషన్ వరకు మాత్రమే నడుస్తాయని దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa