ప్రమాదాలు ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తాయనేదీ ఎవరూ ఊహించలేరు. అలా ఊహించే శక్తే ఉంటే.. ఆ సమయానికి అక్కడ లేకుండా జాగ్రత్తపడతాం. అలాగే మరొకరికి ఎలాంటి నష్టం కలగకుండా అప్రమత్తం చేస్తాం. కానీ అది మన చేతిలో లేని పని. మన చేతిలో ఉన్నది ఏదైనా ఉందటే.. అది కేవలం అప్రమత్తంగా ఉండటం, నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం.. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజుల్లో వంట గ్యాస్ అంటూ లేని ఇళ్లు ఉండదు. ప్రభుత్వాలు కూడా కట్టెల పొయ్యి నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసేలా, పర్యావరణానికి ఉపయోగకరంగా ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నాయి. దీంత పల్లె నుంచి పట్నం వరకూ గ్యాస్ పొయ్యి లేని ఇళ్లు ఉండేది చాలా తక్కువ.
బాడీ పెయిన్స్ తగ్గేందుకు ట్యాబ్లెట్స్, బామ్స్ వాడే బదులు ఇంట్లోని కొన్ని పదార్థాలు చాలు, నొప్పులు ఇట్టే తగ్గుతాయ్
అయితే ఈ వంట గ్యాస్ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో.. అలాగే అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. గ్యాస్ స్టవ్, సిలిండర్ల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అయితే ముందే చెప్పుకున్నట్లుగా ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొన్నిసార్లు ప్రమాదాలను తప్పించుకోలేకపోవచ్చు. ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు గ్యాస్ వినియోగదారుల కుటుంబానికి బీమా అందిస్తారు. ఆ కుటుంబానికి రూ.30 లక్షల వరకూ బీమా వర్తిస్తుంది. అయితే వీటిపై లబ్దిదారులకు సరైన అవగాహన ఉండటం లేదు.
సాధారణంగా గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బీమా వర్తిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగి ఆస్ తి నష్టం సంభవిస్తే.. రెండు లక్షల రూపాయల బీమా వర్తిస్తుందంటున్నారు. అలాగే ప్రమాదంలో ఎవరైనా చనిపోతే రూ. 6 లక్షలు బీమా సొమ్ము చెల్లిస్తారు. గ్యా్స్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ.2 లక్షలు, అలాగే తక్షణ సాయం కింద రూ.25000 అందించాలని నిబంధనలు ఉన్నాయి. అలాగే కుటుంబం మొత్తానికి కలిపి గరిష్ఠంగా 30 లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది.
అయితే బీమా సొమ్ము రావాలంటే.. ప్రమాదం జరిగిన వెంటనే సమీప పోలీస్స్టేషన్కు వివరాలను తెలియజేయాలి. అలాగే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్/ ఏజెన్సీ కూడా ప్రమాదం తాలూకు సమాచారం చేరవేయాలి. దీనిపై వారు విచారణ జరుపుతారు. ఈ విచారణలో గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారిస్తే సదరు డిస్ట్రిబ్యూటర్ ఆయిల్ కంపెనీకి, ఇన్సూరెన్స్ సంస్థలకు విషయం చేరవేస్తుంది. ఇక పరిహారం పొందాలంటే మరణ ధ్రువీకరణ పత్రం, పోస్టుమార్టం రిపోర్టు, మెడికల్ బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa