ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేణిగుంటలో దారుణం....తనను చూసి నవ్వాడని నరికేశాడు

sports |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 08:52 PM

తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నవ్వాడనే కారణంతో ఓ 17 ఏళ్ల కుర్రాడిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తిరుపతి జిల్లా రేణిగుంట సంత సమీపంలోని గువ్వలకాలనీలో దంపతులు నివసిస్తున్నారు. భర్త మేస్త్రీ పని చేస్తుంటాడు. అయితే మేస్త్రీ భార్య ఇటీవలే అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో అందరూ తనను చూసి నవ్వుతున్నారని మేస్త్రీ అనుమానిస్తూ వచ్చాడు. అదే అవమానభారంతో రగిలిపోతూ వచ్చాడు. ఈ క్రమంలోనే బుధవారం రోజున శ్రీహరి అనే 17 ఏళ్ల కుర్రాడు.. తనను చూసి నవ్వాడని మేస్త్రీ భావించాడు. అతనిపై చేయి చేసుకున్నాడు. ఈ విషయం కాస్తా ఆ కుర్రాడి తండ్రిని చేరింది.


దీంతో శ్రీహరి తండ్రి.. అతన్ని వెంటబెట్టుకుని గురువారం ఉదయం మేస్త్రీ వద్దకు వెళ్లాడు. ఎందుకు కొట్టావని ప్రశ్నించాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోగా.. శ్రీహరికి, మేస్త్రీకి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కోపంలో మేస్త్రీ.. పూసల దారాలు కోసే కత్తితో శ్రీహరిపై దాడి చేశాడు. కత్తితో మెడపై నరకటంతో శ్రీహరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడ ఉన్నవారు వెంటనే రుయా ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూశాడు శ్రీహరి. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య


మరోవైపు చిత్తూరులో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో ఇల్లాలు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సంతపేటకు చెందిన వెంకటేష్‌ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇప్పటికే పెళ్లి కాగా.. సంతానం లేకపోవటంతో కావ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల కావ్యకు.. సురేష్‌ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్‌.. కావ్యను మందలించాడు. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతుండేవి.


ఈ క్రమంలోనే అక్టోబర్ ఆరో తేదీన వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పోస్టుమార్టం నివేదికలో వెంకటేష్‌ది ఆత్మహత్య కాదని తేలడంతో పోలీసులు కావ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. కావ్య, సురేష్‌ కలిసి వెంకటేష్‌ గొంతుకు తాడి బిగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై చున్నీతో ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించారని చిత్తూరు వెల్లడించారు. ఈ కేసులో కావ్య, సురేష్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa