ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకుండా ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 05:16 PM

చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాణ సంకటంగా మారిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బిల్లులు చెల్లించండి మహాప్రభో అని పదే పదే వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను పూర్తి స్థాయిలో నిలిపేశాయి. ‘ప్రభుత్వం రూ. మూడువేల కోట్లకుపైగా బకాయి పెట్టింది. ఒక్కో ఆస్పత్రి రూ.రెండు కోట్ల నుంచి రూ.5 కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. అప్పులు, వడ్డీ భారం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఉచిత వైద్య సేవలు అందించలేం.’ అంటూ అన్ని ఆస్పత్రుల వద్ద ప్లెక్సీలు పెట్టారు. చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు వెళ్లిన బాధితులకు ఉచిత చికిత్సలు అందించబోమని, డబ్బు కడితే వైద్యం చేస్తామని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. దీంతో అనారోగ్యం బారినపడ్డ పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa