ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యావసరాల ధరలు తగ్గడం కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 04:49 PM

ప్రధాన మంత్రి మోదీ పర్యటన కోసం రాయలసీమ ప్రజలు ఎదురు చూస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జీఎస్టీలో మార్పులు చేయడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబానికి ఏడాదికి 20 నుంచి 40 వేలు ఆదా అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం మీద దాదాపుగా 8 వేల కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. దేశ చరిత్రలో ఎప్పుడు ధరలు పెరగడం చూశాం. జీఎస్టీ సంస్కరణ వల్ల ధరలు తగ్గడం కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీలో మార్పుల వల్ల మందులు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల ధరలు భారీగా తగ్గాయని ఆయన స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa