ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తుందంటూ సాక్షి పత్రికకి నోటీసులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 04:59 PM

అసత్య ప్రచారం చేస్తుందంటూ సాక్షి మీడియాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపించింది. కల్తీ మద్యంతో మరణాలు అంటూ ప్రచురించిన వార్తలకి ఆధారాలు చూపాలంటూ సెక్షన్ 179 (1) ప్రకారం నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు.సాక్షి యాజమాన్యంతో పాటు సాక్షి పత్రిక చీఫ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డి, సాక్షి నెల్లూరు జిల్లా బ్యూరో చీఫ్ చిలకా మస్తాన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. నకిలీ మద్యానికి నలుగురు బలి అంటూ సాక్షి పత్రికలో 8.10.2025న ప్రచురించిన వార్తకు సంబంధించిన ఆధారాలు తమకు 12.10.2025న కలిగిరి పోలీస్ స్టేషన్‌కి వచ్చి సమర్పించాలని సాక్షి యాజమాన్యానికి నోటీసుల్లో స్పష్టం చేశారు.ఆధారాలు చూపించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సాక్షికి నోటీసులు జారీ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa