ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, ఆసీస్ తొలి వన్డే మ్యాచ్‌,,,,రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లీ

sports |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 11:02 PM

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ .. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. పెర్త్ వేదికగా ఆదివారం ఉదయం 9 గంటలకు తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ పలు రికార్డులపై కన్నేశాడు. పరుగుల రారాజుగా నిలిచిన విరాట్.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో పలు కీలక మైలురాళ్లను చేరుకునే అవకాశం ఉంది. అవేంటంటే..


*36 ఏళ్ల విరాట్ కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక రన్స్‌ చేసిన ప్లేయర్‌గా నిలిచేందుకు చేరువయ్యాడు. అతడు మరో 54 రన్స్ చేస్తే.. వన్డే క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన రెండో ప్లేయర్‌గా నిలుస్తాడు. విరాట్ కోహ్లీ.. 290 వన్డే ఇన్నింగ్స్‌లలో 14,181 పరుగులు, 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు చేశాడు. మరో 54 రన్స్ చేస్తే.. కుమార సంగక్కర 404 మ్యాచ్‌ల్లో 14,234 పరుగులను అధిగమిస్తాడు.


  *ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో (వన్డే, టీ20)లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచేందుకు కోహ్లీకి మరో 68 పరుగులు అవసరం. ప్రస్తుతం ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్‌ 18,436 పరుగులు ఉన్నాడు. కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు వన్డేల్లో 14,181 రన్స్, టీ20లలో 4,188 రన్స్ చేశాడు.


*వన్డేల్లో మరో సెంచరీ చేస్తే.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ విరాట్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం అతడు వన్డేల్లో సచిన్‌తో సమానంగా 51 శతకాలు నమోదు చేశాడు. ఇదే సమయంలో మరో రికార్డు కూడా అతడి ఖాతాలో చేరనుంది. ఆస్ట్రేలియా టూర్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే.. విదేశీ గడ్డపై 30 సెంచరీలు చేసిన తొలి ఆసియా క్రికెటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ విదేశీల్లో 29 సెంచరీలు కొట్టాడు. మరి ప్రస్తుత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ద్వారా విరాట్ కోహ్లీ.. ఇందులో ఏయే రికార్డులు బ్రేక్ చేస్తాడో చూడాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa