మరికొన్ని గంటల్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే అందరి దృష్టి రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీపైనే ఉంది. ఎందుకంటే సుమారు ఏడు నెలల విరామం తర్వాత వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.
ఆదివారం మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సరిగ్గా మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడేందుకు 35 శాతానికి పైగా అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో సమయంలో వర్షం జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో మ్యాచ్కు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
అయితే వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దు అయ్యే అవకాశం మాత్రం లేదు. కానీ స్వల్ప వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడమో.. లేదా మధ్యం అంతరాయం కలగడమో జరిగే అవకాశం ఉంది. ఇక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి.
పెర్త్ స్టేడియంలోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామం వంటిదే. ఈ పిచ్ నుంచి పేసర్లకు అనుకున్నంత పేస్, బౌన్స్ లభిస్తుంది. దీన్ని ఉపయోగించుకుని బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని బౌలర్లు భావిస్తారు. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభంలో ఇది ఎక్కువగా ఉంటుంది. వాతావరణం కూడా బౌలర్లకు అనుకూలంగానే ఉండనుంది. దీంతో వారు మరింత చెలరేగిపోనున్నారు! దీంతో స్పిన్ బౌలర్లకంటే కూడా ఇరు జట్లూ ప్రధానంగా పేసర్లతోనే బరిలోకి దిగనున్నాయి. స్పెషలిస్టు స్పిన్నర్ తుది జట్టులో తీసుకోవడం కూడా కష్టమే. మరి టీమిండియా తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa