ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాతావరణ అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 08:01 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఈ ఆవర్తనం మంగళవారం నాటికి అల్పపీడనంగా మారనుందని తెలిపింది. రాబోయే 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 22వ తేదీ నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేశ్ కుమార్ మత్స్యకారులకు కీలక సూచనలు జారీ చేశారు. 21వ తేదీ మధ్యాహ్నం నుంచి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారనున్నాయని, అందువల్ల ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న జాలర్లు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మత్స్యశాఖ లేదా స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తెలిపారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa