ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైనప్పటికీ, భారత జట్టు ప్రదర్శించిన పోరాట పటిమపై కెప్టెన్ శుభ్మన్ గిల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డే కెప్టెన్గా తన తొలి మ్యాచ్లోనే ఓటమి ఎదురైనా, జట్టులోని సానుకూల అంశాలను ప్రస్తావించాడు. ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని, సిరీస్లో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.ఆదివారం పెర్త్లో వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 130 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37), మాథ్యూ రెన్షా (21 నాటౌట్) రాణించడంతో 21.1 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ, "పవర్ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోతే మ్యాచ్లో ఎప్పుడూ వెనుకబడే ఉంటాం. మా విషయంలో అదే జరిగింది. అయితే 130 పరుగుల తక్కువ స్కోరును కాపాడుకుంటూ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లగలిగాం. మా బౌలర్లు అద్భుతంగా పోరాడారు. ఈ విషయంలో మాకు చాలా సంతృప్తిగా ఉంది" అని వివరించాడు. ఈ ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa