రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన కల్తీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి జోగి రమేశ్ అని, ఈ కేసులో అతడు అరెస్ట్ కావడం ఖాయమని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. శనివారం సాయంత్రం ఓ ప్రముఖ టీవీ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలను వెంకన్న ఈ మేరకు తిప్పికొట్టారు.చర్చా కార్యక్రమంలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, "కల్తీ మద్యం తయారీ వెనుక ఉన్నది జోగి రమేశే. ఆయన ఆదేశాల ప్రకారమే ఇదంతా జరిగింది. ఈ విషయాన్ని ఇప్పటికే విచారణలో నిందితుడు జనార్దన్రావు అంగీకరించారు. సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి, అందుకే జోగి రమేశ్ ను అరెస్ట్ చేయడం ఖాయం" అని అన్నారు. జోగి రమేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసత్యాలు మాట్లాడుతున్నారని, అతడి మాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. అతడి రాజకీయ జీవితం మొత్తం అక్రమాలతోనే నిండిపోయిందని ఆరోపించారు.అంతటితో ఆగకుండా, జోగి రమేశ్ ఆర్థిక అక్రమాలపై కూడా బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "జోగి రమేశ్ వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారు అగ్రిగోల్డ్ బాధితులను బెదిరించి వారి ఆస్తులను బలవంతంగా రాయించుకున్నారు. ఆయన అవినీతి గురించి మాట్లాడాలంటే ఎంతో ఉంది" అంటూ విరుచుకుపడ్డారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.ఇదే సమయంలో, గతంలో చంద్రబాబు నివాసం వద్ద జరిగిన నిరసన ఘటనపైనా వెంకన్న స్పందించారు. "ప్రశాంతంగా నిరసన తెలిపే వాళ్లు చేతుల్లో రాళ్లు పట్టుకుని ఎందుకు వెళ్తారు అది నిరసన కాదు, స్పష్టంగా దాడి చేసేందుకే వెళ్లారు. ఇదే తరహాలో మేము కూడా జగన్ ఇంటికి రావాలా అని ప్రశ్నించారు. ఆనాడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి ప్రయత్నించడం హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. టీవీ ఛానల్లో జోగి రమేశ్ చేసిన అసత్య ప్రచారానికి ప్రతిస్పందనగానే తాను ఈ విషయాలు చెప్పాల్సి వస్తోందని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇరు పార్టీల మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa