2025 మహిళల వన్డే ప్రపంచకప్లో కీలక మ్యాచ్లో శ్రీలంక 7 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. ఈ విజయంతో లంక సెమీఫైనల్ ఆశలను కొనసాగించగలిగింది. మరోవైపు, టోర్నీ నుంచి తొలిసారిగా నిష్క్రమించిన జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది.ఈ మ్యాచ్లకు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్కు అర్హత సాధించారు. ఇప్పుడు నాలుగో స్థానాన్ని కోసం భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి. లీగ్ దశలో కేవలం ఏడు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి, కాబట్టి త్వరలో నాలుగో స్థానంపై స్పష్టత రానుంది.భారత్ ఐదు మ్యాచ్లలో నాలుగు పాయింట్లు సంపాదించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. టీమిండియా నెట్ రన్ రేట్ 0.526గా ఉంది. హర్మన్ప్రీత్ సేన వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోడం సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. మిగిలిన రెండు మ్యాచ్లలో గెలిస్తేనే సెమీఫైనల్లో స్థానం ఖాయం అవుతుంది.గురువారం న్యూజిలాండ్తో జరగనున్న మ్యాచ్ టీమిండియాకు డూ-ఆర్-డై సందర్భంలా ఉంది. ఒకవేళ భారత్ ఓడిపోతే, ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడాలి. తర్వాతే టీమిండియా చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించాల్సి ఉంటుంది.వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దయితే, టీమిండియా బంగ్లాదేశ్ను ఓడించాలి. అదే సమయంలో, శ్రీలంక లేదా పాకిస్తాన్ ఆరు పాయింట్లు సాధించకపోతే, భారత్ నాలుగో స్థానానికి అర్హత పొందుతుంది. చివరి రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయైతే, నెట్ రన్ రేట్ ఆధారంగా భారత జట్టు సెమీఫైనల్కు చేరుతుంది. కానీ, ఇంగ్లాండ్ న్యూజిలాండ్ను ఓడించాలి.న్యూజిలాండ్ ఐదు మ్యాచ్లలో నాలుగు పాయింట్లతో ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ -0.245, కాబట్టి పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. కివీస్ మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే ఎనిమిది పాయింట్లతో సెమీఫైనల్లో చేరుతుంది. ఈ నేపథ్యంలో, భారత్తో జరిగే వారి మ్యాచ్ డూ-ఆర్-డైగా మారింది. భారత్ ఓడితే, ఇంగ్లాండ్ చేతిలో కివీస్ ఓడాలి, తర్వాతే టీమిండియా బంగ్లాదేశ్ను ఓడించాలి.పాకిస్తాన్, శ్రీలంకకు కూడా అవకాశాలు ఉన్నప్పటికీ, సాధ్యంకాని పరిస్థితి కాస్త ఎక్కువ. పండుగల రేసులో ఏ జట్టు చివరికి సెమీఫైనల్కి చేరుతుంది అనేది చూడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa