ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికీ రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 12:56 PM

కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరులో బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 20 మంది చనిపోయినట్లు సమాచారం. ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.అయితే, బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa