మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్.. బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర సంచలనం రేపుతోంది. ఆమె మరణం తర్వాత చేతిపై ఉన్న సూసైట్ లెటర్.. ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఇక ఆ మహిళా డాక్టర్పై ఓ ఎస్సై.. 5 నెలల వ్యవధిలో 4 సార్లు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆత్మహత్యకు ముందే.. ఆమె తనపై జరుగుతున్న వేధింపులను వివరిస్తూ.. డీఎస్పీకి లేఖ కూడా రాసినట్లు సమాచారం. ఈ డాక్టర్ సూసైడ్ కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపడంతో స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో.. వెంటనే ఆ ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు.
సతారా జిల్లాలోని ఫల్టాన్ సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్ గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆమె చేతిపై రాసిన సూసైడ్ నోట్ తీవ్ర ఆరోపణలకు దారితీసింది. బాధితురాలు తన చేతిపై రాసిన నోట్లో ఫల్టాన్ రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బద్నే తన చావుకు కారణమని స్పష్టంగా పేర్కొంది. పోలీస్ ఇన్స్పెక్టర్ గోపాల్ బద్నేనే తన మరణానికి కారణమని.. అతడు తనను నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. గోపాల్ బద్నే తనను ఐదు నెలలకు పైగా అత్యాచారం, మానసిక, శారీరక వేధింపులకు గురిచేశాడని పేర్కొంది. పోలీసు అధికారి నిరంతర వేధింపుల వల్లే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది.
ఇక ఈ ఆత్మహత్యకు కొన్ని నెలల ముందు.. అంటే జూన్ 19వ తేదీన ఆ బాధితురాలు ఇదే తరహా ఆరోపణలను ప్రస్తావిస్తూ ఫల్టాన్ సబ్ డివిజనల్ ఆఫీస్ డీఎస్పీకి ఒక లేఖ రాసినట్లు తెలిసింది. ఆ లేఖలో ఆమె గోపాల్ బద్నే, సబ్ డివిజనల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాటిల్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ లడ్పుత్రే సహా ముగ్గురు ఫల్టాన్ రూరల్ పోలీసు అధికారులపైనా వేధింపుల ఆరోపణలు చేసింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని.. ఈ అంశంపై దర్యాప్తు జరిపి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
ఇక ఈ వ్యవహారం తీవ్రం కావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు నిందితుడు ఎస్సై గోపాల్ బద్నేను సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరోవైపు అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. అధికార మహాయుతి ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రక్షించాల్సిన పోలీసులే వేధిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. బాధితురాలు గతంలో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కేవలం విచారణకు ఆదేశిస్తే సరిపోదని.. నిందితులను ఉద్యోగాల నుంచి తొలగించాలని, లేదంటే వారు దర్యాప్తుపై ప్రభావం చూపిస్తారని డిమాండ్ చేశారు.
ఈ ఘటన దురదృష్టకరమని.. అధికార బీజేపీలో భాగమైన ఎమ్మెల్సీ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చిత్ర వాఘ్ పేర్కొ్న్నారు. నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం తమ దృష్టికి వచ్చిందని.. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని చెప్పారు. అధికార కూటమిలో భాగమైన ఎన్సీపీ నాయకుడు ఆనంద్ పరాంజపే కూడా మహిళలపై అఘాయిత్యాల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానం ఉందని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్.. బాధితురాలి ఫిర్యాదుపై ఎందుకు చర్య తీసుకోలేదో దర్యాప్తు చేయాలని సతారా ఎస్పీని ఆదేశించింది. పరారీలో ఉన్న నిందితుడిని త్వరగా పట్టుకోవాలని.. బాధితురాలికి సహాయం అందించడంలో విఫలమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa