ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమండ్రి, తుని ఘటనలే రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదన్న సంకేతాలు ఇస్తున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 26, 2025, 12:38 PM

వైయస్.జగన్ కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే విశాఖలో గూగుల్ డేటాసెంటర్ ఏర్పాటులో చంద్రబాబు, లోకేష్ లు  ఆదానీ పేరు చెప్పకుండా చివరి వరకు ప్రచారం చేసుకున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, ఒక బిల్డింగ్ కట్టి ఆంతా తానే చేశానని చెప్పుకోవడం బాబుకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని, రాజమండ్రి, తుని ఘటనలే ఇందుకు నిదర్శనమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యమే ఈ అఘాయిత్యాలకు కారణమని, ఇంత జరుగుతున్న ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ఆక్షేపించారు. కర్నూలు బస్ ప్రమాదంలో చనిపోయిన వారికి పార్టీ తరపున సంతాపం ప్రకటించిన భరత్... ప్రభుత్వం నిర్లక్ష్యం తోనే నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa